26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

వైద్య విద్యలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: ఎనిమిదేళ్ల పాలనతో తెలంగాణ సీఎం కేసీఆర్ 16 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. వైద్య విద్యలో ఆయన గొప్ప చరిత్ర సృష్టించారని వివరించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావచ్చిందని స్పష్టం చేశారు. ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అలాగే గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందో ప్రధాని  నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత 67 ఏళ్ల కాలంలో కేవలం తెలంగాణలో కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఏర్పాటు అయ్యాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, రామగుండెం, జగిత్యాలలో దాదాపుగా పూర్తయిన మెడికల్ కాలేజీల చిత్రాలను పంచుకుంటూ, కొత్తగూడెంలో మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండలో కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.

మోదీ ఇచ్చిన మెడికల్‌ కాలేజీలు సున్నా
ప్రధాని మోదీ తెలంగాణకు మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీలు సున్నా అని మరో ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య విద్యలో చరిత్ర లిఖించారని తెలిపారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles