పాట్నా: బీజేపీ ముక్త్ భారత్తోనే దేశాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీ వ్యతిరేక శక్తుల్ని సంఘటితం చేస్తున్నామని చెప్పారు. ‘బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి. నితీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కోరుకుంటున్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. విస్తృతంగా చర్చించాక నాయకత్వంపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటాం. తమతో వచ్చేవారితో కలిసి వెళ్తామని, రానివారిని వదిలిపెడతామన్నారు సీఎం కేసీఆర్.
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి. దేశంలో గుణాత్మక మార్పులు రావాలి. బీజేపీ ముక్త్ భారత్తోనే మనం ముందుకు వెళ్లగలం. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది. అన్ని పార్టీలను తుడిచిపెడతామని బీజేపీ నేతలు అంటున్నారు. మేకిన్ ఇండియా నినాదం ఏమైంది?. దేశాన్ని వినాశనం చేస్తున్నారు.’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
గాల్వాన్ అమరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్తో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో రొటీన్ ప్రభుత్వాలు వద్దని… దేశాన్ని మార్చే ప్రభుత్వం రావాలని పిలుపు నిచ్చారు. విద్యుత్ చట్టం తేవడం వెనక పెద్దకుట్ర ఉందని… ప్రైవేట్లో బొగ్గు కొనాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ప్రశ్నించారు. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని.. ఇతర దేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర విధానాల కారణంగా ఎఫ్డీఐలు దేశం నుండి తమ డబ్బును ఉపసంహరించుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు. ‘బ్రెయిన్ డ్రెయిన్’ అనే పదాన్ని ‘క్యాపిటల్ డ్రెయిన్’ అని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిందించారు. సాయుధ దళాలలో రిక్రూట్మెంట్ కోసం “అగ్నిపత్” పథకాన్ని “ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండా” తీసుకొచ్చినందుకు మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ… బీహార్కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలని తాను చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండిగా నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక కేటగిరీ హోదా కోసం బీహార్ డిమాండ్ను “తిరస్కరిస్తున్న” ఉదాహరణను సీఎం కేసీఆర్ ఉటంకిస్తూ, ప్రైవేటీకరణ జోలికి వెళుతున్నందుకు, రాష్ట్రాల ఆందోళనల పట్ల ఉదాసీనత చూపుతున్నందుకు కేంద్రాన్ని నిందించారు. చాలా ఏళ్ల క్రితం అమెరికా పర్యటనలో మోదీ ‘అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’ అని మాట్లాడారని, ఇది దౌత్యపరమైన తప్పిదమని కేసీఆర్ దుయ్యబట్టారు.