హైదరాబాద్: కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని తమ పార్టీ పోటీ చేస్తుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రకటించారు. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కుమారస్వామి దీవించారు. తెలంగాణ పథకాలు దేశంలోనే ఇతరులకు రోల్మోడల్గా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను టీఆర్ఎస్ అర్థం చేసుకుంటుందని, కొత్త కార్యక్రమాలతో వారి అవసరాలను తీరుస్తోందని, ఇవి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
“దేశాభివృద్ధికి సహాయపడే వినూత్న ఆలోచన దేశానికి అవసరం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విజన్ ఉన్న నాయకుడని, ఆయన బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావడం నేటి ఆవశ్యకమని అన్నారు. చంద్రశేఖర్ రావు ఇతర రాష్ట్రాల పర్యటనల సందర్భంగా జేడీ(ఎస్) సీనియర్ నాయకులు, శాసనసభ్యులు ఆయన వెంట ఉంటారని, ఆయన ప్రయత్నాలకు మద్దతుగా ఉంటారని ఆయన తెలిపారు.
ప్రముఖ దళిత పార్లమెంటు సభ్యుడు, విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె) అధినేత తోల్ తిరుమావళవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని తేవాలని తీసుకున్న నిర్ణయం… సరైన సమయంలో తీసుకున్న సమయోచిత, తెలివైన నిర్ణయం. దళితులు, గిరిజనులు, రైతుల అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన విధంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చొరవ తీసుకోలేదన్నారు. తెలంగాణ తరహాలో దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
రాబోయే కాలంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో అనైక్యతకు కారణమవుతున్న బీజేపీ విభజన రాజకీయాలను మానుకోవాలి’ అని ఆయన అన్నారు.