33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

9 జిల్లాల్లో ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్లు’… త్వరలో ప్రారంభం!

హైదరాబాద్: తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్’లను త్వరితగతిన ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు సోమవారం తెలిపారు. గర్భిణీల ఆరోగ్యం కోసం కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ను ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యంగా తెలంగాణలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల పోషకాహార స్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లు అందించనున్నారు. గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ బూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లను ఇవ్వనున్నారు.

ఈ జిల్లాల్లో కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల ద్వారా మొత్తం 1.5 లక్షల మంది గర్భిణులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఒక్కో పోషకాహార కిట్‌ ధర రూ. 2,000. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ANC తనిఖీల సమయంలో గర్భిణీ స్త్రీలకు రెండుసార్లు  ఈ కిట్‌ను అందిస్తారు. కిట్‌లో రెండు కిలోల న్యూట్రీషియన్ మిక్స్ పౌడర్ రెండు బాటిళ్లు, కిలో ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్‌లు, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి.

ఆరోగ్య రంగంపై సమీక్షా సమావేశంలో, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని, ప్యాన్డ్ సి-సెక్షన్లను తగ్గించాలని ఆరోగ్య మంత్రి అధికారులను కోరారు. “మరిన్ని సాధారణ ప్రసవాలు జరిగేలా చూసుకోవడానికి, రాబోయే రోజుల్లో, మేము తెలంగాణ వ్యాప్తంగా 133 మంది మంత్రసానులను నియమిస్తాం. వీరు గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవం జరిగేలా ప్రోత్సహిస్తారు,  శిక్షణ ఇస్తారు” అని హరీష్ రావు చెప్పారు.

రాష్ట్రంలోని 729 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles