హైదరాబాద్: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో ఎంవోయూను గురువారం పునరుద్ధరించుకుంది. వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ ప్రెసిడెంట్, ప్రొ బర్నీ గ్లోవర్, వైస్ ప్రెసిడెంట్ ప్రొ డెబోరా స్వీనీ, వైస్ ఛాన్స్లర్ ప్రొ లిండా టేలర్ గురువారం ఓయూ అధికారులతో సమావేశయమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల వర్సిటీ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు ఈ ఎంఓయూ దోహదపడనుందని ఉస్మానియా వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ రవీందర్ అన్నారు.
ఒప్పందంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, సైకాలజీ (పాజిటివ్ సైకాలజీ మరియు సైకో-లింగ్విస్టిక్స్), హెల్త్ సైన్స్, క్యాన్సర్ రీసెర్చ్ అండ్ జెనెటిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్ అనలిటిక్స్, లెక్చర్లు/వెబినార్ సిరీస్ వంటి పరిశోధన రంగంలో పరస్పర సహకరించుకుంటామన్నారు. జెనెటిక్స్ తదితర అంశాల్లో సంయుక్తంగా ప్రసంగాలు, పరిశోధనలు, ఆన్లైన్ కోర్సులు నిర్వహించనునన్నట్లు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.
వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ బర్నీ గ్లోవర్, ఫలవంతమైన మరియు పరస్పర ప్రయోజనకరమైన సహకారాల కోసం ఉమ్మడి ప్రచురణలు, ఉమ్మడి పర్యవేక్షణ, నిధుల పరిశోధన, వివిధ కోర్సులు, ఫీజు మినహాయింపులను నొక్కి వక్కాణించారు.
సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో బ్లెండెడ్ లెర్నింగ్తో కోర్సులను రూపొందించడానికి పశ్చిమ సిడ్నీలోని అకడమిక్ యూనిట్తో ఉస్మానియా యూనివర్సిటీని అనుసంధానం చేస్తామని ప్రొఫెసర్ గ్లోవర్ హామీ ఇచ్చారు.