హైదరాబాద్: ఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడ ఫ్లైఓవర్, ‘అండర్ పాస్‘లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది.
గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ కూడలి వైపు వన్ వే ఫ్లైఓవర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది.
గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు, మసీద్ బండా, బొటానికల్ గార్డెన్ నుండి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాయి.
ఈ ఫ్లైఓవర్ మీది నుంచి మాదాపూర్, హఫీజ్ పేట్ వైపు వెళ్లవచ్చు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
కొండాపూర్ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ కూడళ్లలో ట్రాఫిక్ తగ్గనుంది. ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ ప్రయాణం సులభం కానుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2022 జనవరి 1న షేక్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగిందని, 2023 జనవరి 1న అండర్పాస్తో కూడిన కొత్తగూడ మల్టీలెవల్ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
కొత్తగూడ మల్టీ లెవల్ ఫ్లైఓవర్ వల్ల ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలకు ఎంతో అవసరమైన ఉపశమనం లభిస్తుందని, హైదరాబాద్లో ఉన్న భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశంలోని మరే ఇతర నగరం సరిపోదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ను సందర్శించిన ఇతర రాష్ట్రాలు మరియు దేశాల ప్రజలు, ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి తరువాత, నగరంలో మౌలిక సదుపాయాల పరంగా జరిగిన ప్రధాన రూపాంతరం పట్ల ఎంతో ఆకట్టుకున్నారని మరియు హైదరాబాద్లో వేగంగా వచ్చిన మార్పులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కారణమని రామారావు అన్నారు. .
ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ జీ విజయలక్ష్మి, సేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.