23.7 C
Hyderabad
Monday, September 30, 2024

వక్ఫ్ బోర్డు ఇంఛార్జి సీఈవోగా బి. షఫీవుల్లా!

హైదరాబాద్: తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMRIES) సెక్రటరీ… షఫీవుల్లాను తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమించి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వక్ఫ్‌ బోర్డు సీఈవో, మైనారిటీల సంక్షేమశాఖ డైరెక్టర్ పోస్టులో‌ ఉన్న షానవాజ్‌ ఖాసీంను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  బదిలీ తరువాత ఆయన్ని  మల్టీజోన్-II  ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.

ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు షఫీవుల్లా…  మైనారిటీల సంక్షేమ శాఖ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పోస్టుల్లో అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

షాన్వాజ్ ఖాసింకు వక్ఫ్  బోర్డుకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తపిన్ని విషయం తెలిసిందే. అదే సమయంలో వక్ఫ్ బోర్డు సీఈవో నియమించేందుకు ప్రత్యామ్నాయ అధికారుల పేర్లను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది.

ఇబ్రహీం షరీఫ్ నాయబ్ ఖాజీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం సుధీర్ కుమార్, వెంటనే వక్ఫ్ బోర్డుకు పూర్తి స్థాయి సీఈవోను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. షానవాజ్ ఖాసీమ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించాలని కోరుతూ వక్ఫ్ బోర్డు అక్టోబర్ 20న తీర్మానం చేసినప్పటికీ,  ప్రస్తుత సీఈవోను కొనసాగించడం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇన్‌ఛార్జ్ సీఈఓ పనితీరులో సీఈవో జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వాదించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles