28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మక్కా మసీదు మరమ్మతు పనులు… పరిశీలించిన మైనారిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు!

హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మక్కా మసీదును గురువారం సందర్శించి పునరుద్ధరణ, పరిరక్షణ పనులను పరిశీలించారు. పవిత్ర రంజాన్‌ పండుగ నాటికి మక్కా మసీదు మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారును ఆదేశించారు.

మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి. షఫీవుల్లా,, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, ఇతర అధికారులు పనుల పురోగతిని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను నిర‌్దేశించారు. ఈ పర్యటనలో హైదరాబాద్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి  మహమ్మద్‌ ఇలియాస్‌, పురావస్తు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

సమయాన్ని ఆదా చేసేందుకు ఆధునిక యంత్రాలను వినియోగిస్తామని షఫీవుల్లా తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ పునరుద్ధరణ పనులను పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పునరుద్ధరణ పనులు, , విద్యుత్తు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles