హైదరాబాద్: నగర శివార్లలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని అప్పగిస్తామని, రూ.40 కోట్లు కేటాయిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కనీం శంకుస్థాపన కూడా జరగలేదు. ఇక తాజా బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అయితే అదే సమయంలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయిస్తూ 6 ఎకరాల భూమిని అప్పగిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
కోకాపేటలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు 2017లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి భూమిని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రం నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించారు. అయితే ఇది ఇంకా సుదూర కలలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం చెవులకు మాత్రమే ఇంపుగా అనిపిస్తోందని మైనార్టీలు అంటున్నారు.
ఇదే సమయంలో బంజారాహిల్స్లోని అత్యంత విలువైన స్థలంలో కోట్లాది రూపాయలతో శివలాల్ బంజారా భవన్, ఆదివాసీ భవన్లను నిర్మించారు. అయితే హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా… ప్రతిపాదిత ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు.