23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘కేంద్ర ఏజెన్సీలు‘ బీజేపీ చేతిలో తోలుబొమ్మలు… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: బీబీసీ ఇండియాపై ఆదాయపు పన్ను (ఐటి) దాడుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్   “వాట్ ఎ సర్ ప్రైజ్” అంటూ చేసిన ‘ట్వీట్‘లో ఐటీ, సీబీఐ, ఈడీ.. బీజేపీ చేతిలో తోలుబొమ్మల్లా మారిపోయాయని ఎద్దేవా చేశారు.

ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని కూడా కేటీఆర్‌ ఆరోపించారు. వాట్‌ నెక్ట్స్‌ అంటూ కేటీఆర్‌.. తదుపరి హిండెన్‌ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా? అని వ్యాఖ్యానించారు.  ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీ ఇండియాపై ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు సిస్టమ్స్‌ వాడొద్దనీ, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్టు సమాచారం. పాత్రికేయుల ఫోన్లను, ల్యాప్‌టాప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే.. ఈ సర్వేను కాస్తా సోదాలుగా మార్చే అవకాశముందని సంబంధిత అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది.

శాసనమండలి సభ్యురాలు కె.కవిత కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles