Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘వరి సాగు చేయని రైతులకు’ఎకరాకు పదివేలు ఇస్తాం…తెలంగాణ!

హైదరాబాద్: పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, నిల్వ ఖర్చులను తగ్గించడం, అలాగే డిమాండ్ ఉన్న పంటలకు మారడానికి సుముఖంగా ఉన్న వరి రైతులకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలలో భాగంగా, వరి నుండి ఇతర పంటలకు మారే రైతులకు ఎకరాకు రూ.10,000 ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వరి రైతుల కోసం ఉద్దేశించిన ఈ పథకం, పంజాబ్‌లో అమలులో ఉన్న పథకం తరహాలోనే ఉంటుంది. అక్కడ అటువంటి రైతులకు హెక్టారుకు రూ.17,000 ప్రోత్సాహకం అందిస్తున్నారు. వరి […]
Read more

దేశంలోకెల్లా అత్యంత రాజకీయ ప్రేరేపితమైన రాష్ట్రం బెంగాల్‌…సుప్రీంకోర్టు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కేవలం మూడు వారాల ముందు, ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (SIR)కు వ్యతిరేకంగా నిన్న పలు జిల్లాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మాల్దా, జల్పైగురి, కూచ్ బెహార్, పూర్బ బర్ధమాన్‌లలో ఆందోళనకారులు రోడ్లు, హైవేలను దిగ్బంధించారు. వారు టైర్లను తగలబెడుతూ, నిశ్శబ్ద ప్రదర్శనలు నిర్వహిస్తూ, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిజమైన ఓటర్ల పేర్లను పెద్ద ఎత్తున తొలగించారని, ఇది మైనారిటీలు, బెంగాలీ మాట్లాడే […]
Read more

ప్రపంచం ఓ పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతోంది…ఐక్యరాజ్యసమితి అధిపతి!

న్యూయార్క్‌: ప్రపంచం ‘ఓ పెద్ద యుద్ధపు అంచున’ ఉందని, అది మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. ఈమేరకు గురువారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ…శత్రుత్వాన్ని విరమించుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌లను కోరారు. “ఈ యుద్ధం కారణంగా ప్రజలు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నారని, ఇప్పటికే ఆర్థిక పరిణామాలు ఆందోళనకరంగా మారాయని, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇదే సరైన సమయమని” గుటెర్రస్‌ అన్నారు. ఇరాన్ తన పొరుగు […]
Read more

చమురు, గ్యాస్ కోసం భారత్‌ ప్రపంచవ్యాప్తంగా అన్వేషించాలి…అరవింద్‌ సుబ్రమణియన్‌!

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వల్ల కలిగే ఆర్థిక పరిణామాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా కీలకమైన ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా భారతదేశం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదైన వృద్ధి,అధిక నిరుద్యోగాన్ని కలిపి చూపే ఒక ఆకస్మిక ఆర్థిక సంఘటన (“stagflationary shock”)ను ఎదుర్కొంటున్నాయని ఆయన హెచ్చరించారు. ఈమేరకు ఇండియా టుడే ఇంటర్వ్యూలో డాక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ… […]
Read more

గద్దర్‌ను ‘నక్సల్’ అన్న అమిత్ షా…విమర్శించిన తెలంగాణ కాంగ్రెస్!

హైదరాబాద్: దివంగత తెలుగు కవి-విప్లవకారుడు గద్దర్‌ను “నక్సల్” అని అభివర్ణించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పార్టీ నాయకులు నగరవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అమిత్‌షా వ్యాఖ్యలు గద్దర్‌ను మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలను కూడా అవమానించడమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. “గద్దర్ తన జీవితాంతం […]
Read more

అస్సాంలో “నిరుద్యోగం పెరిగింది”…బీజేపీపై ప్రియాంక గాంధీ విమర్శలు!

గౌహతి: అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆరు ఆదివాసీ సమూహాలకు ఎస్టీ హోదాను ఆలస్యం చేస్తోందని, రాష్ట్రంలోని 10 లక్షల మందికి ఉచిత చికిత్స, శాశ్వత భూమి పట్టాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదని ఆమె ఆరోపించారు. “బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. నిరుద్యోగం పెరుగుతోంది. బీజేపీ పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు,” అని దిబ్రూగఢ్ జిల్లాలోని ఖోవాంగ్ నియోజకవర్గంలో జరిగిన ఒక […]
Read more

కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ నిర్వాసితులకు ఇంటి స్థలం!

వరంగల్‌: కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈమేరకు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిధిలోని రైతులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సంగేం గ్రామ నిర్వాసితులైన 186 మంది రైతులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన […]
Read more

‘మేము యుద్దం నుంచి తొందరగా వైదొలగం’…మాట మార్చిన ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేడు 34వ రోజులోకి ప్రవేశించింది. అయితే యుద్ధ విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. మేము ఇరాన్‌నుంచి తొందరగా వైదొలగమని ట్రంప్‌ అన్నారు. వాషింగ్టన్ తన సైనిక చర్యను ముందుకు తీసుకువెళ్తుందని ప్రతిజ్ఞ చేశారు. ఈమేరకు కెంటకీలోని హెబ్రాన్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ… అన్ని లక్ష్యాలు సాధించే వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని నొక్కిచెప్పారు. అమెరికా ఈ సంఘర్షణను ఉన్నపళంగా ముగించదని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధిని […]
Read more

నేటి నుంచి జనగణన తొలిదశ!

న్యూఢిల్లీ: జనగణనకు వేళైంది. నేడు దేశ వ్యాప్తంగా తొలిదశ ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. తదుపరి దశ – జనాభా గణన – వచ్చే ఏడాది మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది. కాగా, తుది గణనకు తొలి దశ ఒక ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో 31లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు, లక్షమందికి పైగా జనగణన సిబ్బంది పాల్గొంటారు. […]
Read more

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవాస్తవిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టాయన్న’కాగ్‌’!

హైదరాబాద్: గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు 2020-2021 నుండి 2024-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య ఐదేళ్ల పాటు ‘అవాస్తవిక’ బడ్జెట్‌లను ప్రవేశపెట్టాయని కాగ్‌ వెల్లడించింది. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) వారి నివేదిక, ‘Accounts at a glance-2024-2025’లో ఈ విషయం స్పష్టంగా ధృవీకరించారు. సమీక్షలో ఉన్న ఐదేళ్ల కాలంలో, బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసం పెరిగిందని ఈ నివేదిక ఎత్తిచూపింది. 2024-2025 బడ్జెట్ కేటాయింపులలో […]
Read more
1 31 32 33 34 35 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.