Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి ‘వెయ్యి కోట్లు’!

హైదరాబాద్: చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1,000 కోట్లు మంజూరు చేసారు. ముఖ్యమంత్రి రెండవసారి క్యాంపస్‌ను సందర్శించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు, అక్కడ ఆయన పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దాని గత వైభవానికి పునరుద్ధరించి, ప్రపంచ అత్యుత్తమ సంస్థగా మార్చాలనే తన ప్రభుత్వ సంకల్పాన్ని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పునరుద్ధరణ ప్రక్రియలో విద్యార్థులను పాల్గొనేలా చేయడానికి, ప్రతిపాదిత […]
Read more

సైబర్ మోసాల వల్ల కర్ణాటకకు 5,474 కోట్ల నష్టం!

బెంగళూరు: గత మూడు సంవత్సరాలలో కర్ణాటక ప్రజలు సైబర్ మోసాల వల్ల రూ.5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటివరకు పోలీసులు రూ.627 కోట్లు రికవరీ చేయగలిగారని హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. శాసనసభలో సకలేశ్‌పూర్ బిజెపి ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. “ఇటీవలి కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో, కర్ణాటకలో సుమారు 52 వేల సైబర్ మోసాలు జరిగాయి,ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని” పరమేశ్వర అన్నారు. పోలీసు చట్టాలకు […]
Read more

సోషల్ మీడియా నిబంధనలు…భారతీయుల H-1B వీసా అపాయింట్‌మెంట్‌లు వాయిదా!

న్యూఢిల్లీ: యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం భారతదేశంలోని H-1B వీసా దరఖాస్తుదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. చాలా మంది ఆశావహుల అపాయింట్‌మెంట్‌లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. ఈమేరకు మనదేశంలోని యుఎస్ ఎంబసీ నిన్న రాత్రి వీసా దరఖాస్తుదారులకు తెలిపింది. “మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని మీకు ఇమెయిల్ అందినట్లయితే, మిషన్ ఇండియా మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి ఎదురుచూస్తోంది” అని అది తెలిపింది. అలాగే రీషెడ్యూలింగ్ […]
Read more

తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరడానికి ఏటా 8-9 శాతం వృద్ధి చెందాలి… ఆర్‌బిఐ మాజీ చీఫ్!

హైదరాబాద్: రాబోయే 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే…ఏటా 8నుంచి9 శాతం వృద్ధి చెందాలని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఆర్‌బీఐ మాజీ చీఫ్‌ మాట్లాడుతూ…దాని ప్రయోజనాలను విస్తృతంగా పంచుకోకపోతే ఆర్థిక వృద్ధిని కొనసాగించలేమని అన్నారు. “ప్రభుత్వం సమ్మిళిత వృద్ధిని అనుసరించాలి, అంటే వృద్ధి ప్రయోజనాలు తెలంగాణలోని అత్యంత పేద వ్యక్తికి, రాష్ట్రంలోని అత్యంత సుదూర ప్రాంతాలకు చేరాలి” […]
Read more

వందేమాతరంపై మళ్ళీ నెహ్రూను విమర్శించిన మోడీ…ఇదంతా బెంగాల్‌ ఎన్నికలకోసమేనన్న విపక్షం!

న్యూఢిల్లీ: ఓవైపు ఇండిగో సంక్షోభం, మరోవైపు దేశ రాజధాని, ఇతర భారతీయ నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, రూపాయి పతనం మధ్య… వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం లోక్‌సభ ప్రత్యేక చర్చను చేపట్టింది. రోజంతా చర్చించారు. అధికార, విపక్షాలు దాదాపు 12 గంటల పాటు ఒకరినొకరు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో చర్చను ప్రారంభించి, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై మరోసారి దాడి చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు, ముస్లిం లీగ్‌కు తలవంచి ఆయన, […]
Read more

‘ఓటు చోరీ’ అతిపెద్ద ‘దేశ ద్రోహం’…రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికారపార్టీ తీవ్ర విమర్శలు చేశారు. కాషాయపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడి భారతదేశ భావనను నాశనం చేసింది. తద్వారా బీజేపీ అతిపెద్ద దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ని “ ఉపయోగిస్తోందని” పలు ప్రశ్నలను సంధించారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు […]
Read more

గ్లోబల్ సమ్మిట్… తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఘనంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.5.39 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్‌తో పాటు పునరుత్పాదక ఇంధనం, లైఫ్ సైన్సెస్, వినోద రంగాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి. ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఎంవోయూలు చేసుకున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల […]
Read more

సిరియాలో బషర్ అల్-అసద్ పతనానికి ఏడాది పూర్తయింది!

డమాస్కస్‌: సిరియాలో బషర్ అల్-అసద్ పాలన కూలిపోయి ఏడాది పూర్తయింది. దాదాపు 14 సంవత్సరాల యుద్ధం తర్వాత డిసెంబర్ 8, 2024న తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో అసద్ సిరియాను విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆయన 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. కాగా, అల్-అసద్ రష్యాకు పారిపోయాడు, అక్కడ అతనికి ఆశ్రయం లభించింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా బలమైన సిరియాను పునర్నిర్మిస్తానని” ప్రతిజ్ఞ చేశారు. కానీ అసద్ పతనం తర్వాత కూడా […]
Read more

‘ఇండిగో’ గందరగోళంపై సమాధానం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్‌!

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై దుమారం చెలరేగింది. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి… సభనుంచి వాకౌట్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. “మిస్టర్ […]
Read more

మూడవ తరగతి పాఠాన్ని ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించిన టీవీ ఛానళ్లకు మందలింపు!

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌టీ పుస్తకంలోని మూడవ తరగతి పాఠాన్ని కల్పిత ‘లవ్ జిహాద్’ కథనంగా మార్చినందుకు పలు టీవీ ఛానెల్‌లను న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) మందలించింది. ఆ మతపరమైన ప్రసారాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది. కాగా, ఈ కథనాన్ని ఇండియా టీవీ, న్యూస్ 18 మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ABP న్యూస్ వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసాయి. విషయంలోకి వస్తే…రీనా అనే అమ్మాయి “చిట్టి ఆయి హై” అనే […]
Read more
1 75 76 77 78 79 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.