Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అహ్మదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్‌ మోసాన్ని ఛేదించిన ఈడీ!

హైదరాబాద్: అమెరికా పౌరులను మోసం చేస్తున్న అహ్మదాబాద్‌లోని నకిలీ కాల్ సెంటర్లపై హైదరాబాద్ ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుజరాత్‌లోని ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. క్రిప్టోకరెన్సీ, నగదు స్వాధీనంఈ సోదాల్లో 12,000 విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించి, దానిని ED అధికారిక క్రిప్టో వాలెట్‌కు బదిలీ చేశారు. 31 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. నిందితులు తమను తాము యూఎస్ అధికారులమని చెప్పుకుంటూ, గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా డబ్బులు వసూలు […]
Read more

మైనారిటీలపై తుపాకీ గురిపెట్టిన అస్సాం సీఎం!

గువహటి: బీజేపీ అస్సాం యూనిట్‌ ‘X’ లో ఒక వీడియోను పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తుపాకీతో గురిపెట్టి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించారు – ఆ ఇద్దరిలో ఒకరు తలకు టోపీ ధరించగా, మరొకరు గడ్డంతో ఉన్నారు. దీనికి- “పాయింట్-బ్లాంక్ షాట్” అనే శీర్షిక పెట్టారు. అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. కానీ ఈ వీడియో […]
Read more

ఏకాభిప్రాయం ద్వారా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలి…ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్!

ముంబయి: అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) రూపొందించాలని, అది విభేదాలకు దారితీయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భాగవత్ మాట్లాడుతూ… ఒప్పందాలలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని అన్నారు. “అది ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండాలి… మనం నష్టపోకుండా చూసుకోవాలని అన్నారు.” హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ […]
Read more

బడ్జెట్ 2026లో మైనారిటీల పట్ల వివక్ష చూపిన కేంద్రం!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే కేటాయించడం, 20% జనాభా ఉన్న మైనారిటీలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిధుల కోత, స్కాలర్‌షిప్‌ల తగ్గింపు, విద్యా రుణాల సబ్సిడీల నిలిపివేత వంటి నిర్ణయాలు మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని రూఢీ అవుతోంది. ఇది కేవలం సంప్రదాయ బడ్జెట్ లావాదేవీల (eyewash) వ్యవహారంగా మిగిలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో ముస్లిం మైనారిటీ వర్గం సంక్షేమం కోసం […]
Read more

కాళేశ్వరం స్కామ్‌పై కేసీఆర్, హరీష్ రావులను అరెస్టు చేయండి… బీజేపీకి సీఎం రేవంత్‌ సవాల్‌!

హైదరాబాద్: కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేయాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులను అరెస్టు చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించాలని తెలంగాణ సీఎం, బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్‌కు సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేయవద్దని తెలంగాణ […]
Read more

భారత మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథపై పార్లమెంటులో దుమారం!

న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథపై పార్లమెంటులో జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఇదంతా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నరవణే ప్రస్తావించిన ఫోన్ కాల్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో సైన్యానికి అందిన రాజకీయ ఆదేశాలు కేవలం “ఏది సబబు అనిపిస్తే అది చేయండి” అని మాత్రమే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ […]
Read more

భిన్నత్వంలో ఏకత్వపు భావనకు ప్రతీక… మహ్మద్ దీపక్ కుమార్, శైలా నేగీ!

ఈ మధ్య కాలంలో, సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తే కేవలం వార్తా కథనాలు, సెలబ్రిటీల అప్‌డేట్‌లు, స్నేహితుల నుండి వచ్చే అప్‌డేట్‌లు మాత్రమే కాకుండా, చట్టవిరుద్ధమైన, నైతికంగా ఖండించదగిన కంటెంట్ కూడా కనిపిస్తుంది. కెమెరా ముందు పేద ముస్లింలను వేధిస్తున్న వీడియోలను మనం చూస్తుంటాం. కొన్నిసార్లు వారు ముస్లింల దుకాణాల పేర్లను మార్చమని డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు వారు వారి గుర్తింపు కార్డులను చూపించమని డిమాండ్ చేస్తారు. మనలో చాలామంది ఈ చట్టవిరుద్ధమైన ప్రచారాలను ప్రత్యక్షంగా కూడా […]
Read more

అస్సాంలో బెంగాలీ ముస్లింలకు వ్యతిరేకంగా ‘సహాయ నిరాకరణ’… సీఎం హిమంత శర్మ!

గువహటి: బెంగాలీ ముస్లింలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమర్థించుకున్నారు. ఈమేరకు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన సూత్రాలను ఉదహరించారు. శివసాగర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్సాం సీఎం శర్మ మాట్లాడుతూ…బెంగాలీ ముస్లింలు “అస్సాంలో ఉండలేని” పరిస్థితులను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం ప్రతిరోజూ “20 లేదా 30” మందిని బహిష్కరిస్తున్నప్పటికీ, సామూహిక బహిష్కరణ సాధ్యం కాదని ఆయన వివరించారు. దానికి బదులుగా, […]
Read more

మధ్యప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణ…అస్తవ్యస్తం అయిన ముస్లిం కుటుంబాలు!

భోపాల్‌: విద్వేష ప్రసంగాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఈ కథనం చదివితే అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో, జనవరిలో జరిగిన హిందూ సమావేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసారు. ఈ ప్రసంగంతో ప్రభావితమైన ఘోటి-నండోరా గ్రామంలోని ఒక పెద్ద వర్గం…అక్కడి పది ముస్లిం కుటుంబాలను సామాజికంగా బహిష్కరించింది. ఫలితంగా ఈ ముస్లిం కుటుంబాలు రోజువారీ లావాదేవీలు, సేవలు, జీవనోపాధి కోసం ఇబ్బంది పడ్డారు. కాగా, ఈ సమావేశానికి హిందువులు ఎక్కువ మంది హాజరయ్యారు, […]
Read more

సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగగా… మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇప్పటికీ ఎలాంటి […]
Read more
1 20 21 22 23 24 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.