28.2 C
Hyderabad
Saturday, May 18, 2024

సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత- ‘విడలేక నిన్ను వీడిపోయాను నాన్న’

మైక్రోసాఫ్ట్ సీఈఓ, మన తెలుగు తేజం సత్య నాదెళ్ల కుమారుడు మృతి చెందారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలిపింది.
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశాడు. సోమవారం ఉదయం తన కుమారుడు మృతి చెందినట్లు నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

జైన్‌తో తనకున్న పరిచయాన్ని చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ.. మైక్రోసాఫ్ట్‌తో పంచుకున్నారు. నాదెళ్ల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

సంగీతంలో జైన్ అభిరుచి..అతని ప్రకాశవంతమైన చిరునవ్వు, నాదెళ్ల కుటుంబానికి..అతనిని ప్రేమించిన వారందరికీ అతను తెచ్చిన అపారమైన ఆనందం కోసం జైన్ గుర్తుండిపోతాడు” అని చిల్డ్రన్స్ హాస్పిటల్ యొక్క CEO జెఫ్ స్పెరింగ్ తన బోర్డుకి ఒక సందేశంలో పేర్కొన్నారు.

జైన్‌ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి. ఈ వ్యాధి వల్ల మెదడుకు కాళ్లు, చేతులు పట్టు తప్పిపోతాయి. ఏమాత్రం కంట్రోల్ ఉండదు. నడవలేని స్థితిలో ఉండటం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. జైన్ నాదెళ్ల పరిస్థితి కూడా అలాగే ఉండేది. సత్యా నాదెళ్లకు జైన్ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles