25.2 C
Hyderabad
Sunday, May 19, 2024

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి!

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం, శ్రీరంగాపురం గ్రామం శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

చిన్నారికి చెవులు కుట్టించేందుకు కారులో ఎనిమిది మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు చిన్నారులు సురక్షితంగా భయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు ఖమ్మం జిల్లా బోనకల్ (మం) గోవిందపురం గ్రామం, కోదాడ (మం) చిమిరాల గ్రామం వాసులుగా గుర్తించారు. జిల్లా శ్రీకాంత్, లాస్య, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, మాణిక్యమ్మ, చంద్రారావు, స్వర్ణగా గుర్తించారు. ఆరుగురు కుటుంబసభ్యులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది.

ఎస్పీ రాహుల్‌హెగ్డే ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. శ్రీకాంత్‌ బంధువు నందిగామ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles