హైదరాబాద్: లోక్సభ ఎన్నికల బహిష్కరణకు నాగర్కర్నూల్ జిల్లా కోడైర్ మండలం మైలారం గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ గ్రామంలోని ప్రజలు ఓటు వేయరని, ఏ రాజకీయ పార్టీని తమ గ్రామంలో ఓటు అడిగేందుకు రావద్దని మైలారం గ్రామ వాసులు తీర్మానించారు. కారణం: తమ గ్రామంలోని గుట్టను తవ్వకానికి వ్యతిరేకం.
గ్రామంలో ఉన్న గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ పలుమార్లు తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించిన సందర్భంలో ప్రతిసారి గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిపారు. ‘గుట్ట ముద్దు… ఓటు వద్దు’ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు.
గుట్టపైన నాలుగు దేవాలయాలతో పాటు, వర్షాకాలంలో కొండపై పశువులను మేపుకోవాలన్నా, వన్యప్రాణులను (నెమళ్లతో సహా) బతికించుకోవాలన్నా గ్రామానికి సహజ వనరుగా కొండ తప్ప మరేమీ లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
2004 నుంచి ఆ కొండను తవ్వేందుకు మైనింగ్ శాఖ నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని, దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
“వారు రెండు సంవత్సరాలకు ఒకసారి తమ వాహనాలు మరియు యంత్రాలతో ఇక్కడికి వస్తారు, కాని మేము కొండను తవ్వకుండా అడ్డుకుంటూ పోయాం. ఈసారి కొండను తవ్వేందుకు ఇక్కడికి వచ్చినా, లేదా ఎవరైనా రాజకీయ నాయకులు ఓట్లు అడిగేందుకు వచ్చినా వారిని గ్రామంలోకి రానివ్వబోమని, ఒక వేళ వచ్చినా తిరిగి బయటకు వెళ్లనివ్వబోమని నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థుల్లో ఒకరు తెలిపారు.