Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఓయూ హాస్టల్‌లో నాసిరకం భోజనం…విద్యార్థుల నిరసన!

హైదరాబాద్: కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఓయూలో విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా హాస్టల్ విద్యార్థులు నాసిరకం ఆహారం వడ్డించారని ఆరోపిస్తూ నిన్న రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్, చీఫ్ వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, E1 హాస్టల్ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి, ఆహారాన్ని తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారు. మెస్ సమస్యలు, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారులు పెడ చెవిన పెట్టారని […]
Read more

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా 46 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ 4 నుండి ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ సమయంలో అందుబాటులో ఉన్న తాజా ట్రెండ్ ప్రకారం…పశ్చిమ బెంగాల్‌లో 46 లక్షలకు పైగా పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించాలని ఇప్పటికే గుర్తించారు. నిన్న సాయంత్రం వరకు పూర్తయిన గణన ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రకారం… ప్రస్తుతం ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి అర్హత ఉన్న మొత్తం […]
Read more

ఈ ఏడాది పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతక సంవత్సరం…హక్కుల సంఘాలు!

టెల్‌అవీవ్‌: కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిని స్వాగతిస్తుంది. కానీ గాజాలో మాత్రం ఈఏడాది భయానక అనుభవాలను మిగిల్చింది. ఇజ్రాయెల్‌ బాంబుదాడులు ఏకంగా వేలమందిని హతమార్చింది. లక్షల మందిని గాయపర్చింది. మరికొన్ని లక్షలమందిని నిరాయశ్రయులను చేసింది. ఈ సంవత్సరం గాజా ఓ శిధిల నగరంగా మారింది. మొత్తంగా 2025 పాలస్తీనియన్లకు “అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విధ్వంసకర” ఏడాదిగా మార్చాయని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. బిమ్కోమ్, గిషా, అసోసియేషన్ ఫర్ సివిల్ […]
Read more

పదేళ్లలో తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి!

కొత్తగూడెం/హైదరాబాద్: పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ వర్గీకరణ ఆపాలని, తెలంగాణను దేశంలో నంబర్ ఒన్‌ రాష్ట్రంగా మార్చడానికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి… సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు […]
Read more

బంగ్లాదేశ్ ఎన్నికల్లో జమాతే ఇస్లామి ‘బీఎన్‌పీ’ని ఓడిస్తుందా?

ఢాకా: ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన వెంటనే ఎన్నికలు జరిగితే… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వరుసలో ఉందని భావించారు. అయితే ఇప్పుడు BNP ఆ ఆధిక్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి నిశ్శబ్ద విజయానికి దగ్గరగా ఉంది. ఈ విషయమై అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 33% మంది […]
Read more

మహిళా సాధికారతే తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌కు మూలస్తంభం…మంత్రి సీతక్క!

హైదరాబాద్‌: తెలంగాణ మహిళల సాతాధికారతే విజన్‌ డాక్యుమెంట్‌కు కీలకమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047రూపకల్పనలో భాగంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, దానిని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. ఇందులో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. […]
Read more

‘తాగుబోతులకు ఓ దేవుడు’ అన్న సీఎం వ్యాఖ్యలపై రగడ!

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు హిందూ దేవతల ఉనికిని అపహాస్యం చేసిన తర్వాత ఆయనపై రాజకీయ విమర్శలు వచ్చాయి, ప్రతిపక్ష బిజెపి, బిఆర్ఎస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గాంధీ భవన్‌లో జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో […]
Read more

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌!

గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ పదేపదే తూట్లు పొడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ జరిపిన తాజా కాల్పుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు, తూర్పు గాజా నగరంలోని అల్ తుఫా పరిసరాల్లో డజన్ల కొద్దీ పాలస్తీనియన్ కుటుంబాలు ఇజ్రాయెల్ కాల్పుల్లో చిక్కుకున్నాయి. ఆ ప్రాంతం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తరువాత డ్రోన్లు, ట్యాంకులతో కాల్పులకు తెగపడ్డాయి. ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్ డ్రోన్ కాల్పులు జరిపిన తర్వాత ఒక పాలస్తీనియన్ మహిళను మధ్య గాజా నగరంలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ […]
Read more

అవినీతి కేసులో షేక్ హసీనా కుటుంబానికి కొత్త శిక్షలు విధించిన ఢాకా కోర్టు!

ఢాకా: షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి కేసుల కొనసాగింపులో భాగంగా…అక్కడి కోర్టు మరిన్ని శిక్షలు విధించింది. ఢాకాలోని పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్లాట్ల కేటాయింపుకు సంబంధించిన కేసులో పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానా, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్ లకు బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించింది. ఈ భూకేటాయింపులో కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, […]
Read more

వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంపై ఎంపీ కావ్య ఆందోళన!

న్యూఢిల్లీ: నిన్నటినుండి ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య తన నియోజకవర్గంలో సమస్యలపై గళమెత్తారు. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)పై నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో కార్యాచరణ కేంద్రాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, పరిశ్రమ సంబంధాలు, ఉపాధి ఫలితాలపై వివరాలు కావాలని ఆమె డిమాండ్ చేశారు. మొదట్లో PMKVY ప్రారంభించినప్పటి నుండి ఎనిమిది శిక్షణా […]
Read more
1 78 79 80 81 82 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.