కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. యూకే, సింగపూర్, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్లో ఉంచారు.