రైతులు వరి మాత్రమే కాక ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచించారు. తెలంగాణ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, మినుములు, పత్తి, పెసర్లు, శనగల వంటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పంట మార్పిడి విధానం అవలంబించి అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గద్వాలకు వచ్చారు.