25.2 C
Hyderabad
Sunday, May 19, 2024

మాస్క్‌ లేకపోతే వెయ్యి జరిమానా

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రంలో జాగ్రత్తలు తదితర అంశాలపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోందని.. ఆంక్షలు పెట్టినా కొద్దిరోజుల్లోనే నాలుగు దేశాల నుంచి 24 దేశాలకు పాకిందని తెలిపారు. అందువల్ల అందరూ మాస్కులు పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేశారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles