హైదరాబాద్: లోక్సభ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరుకాని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 30 మంది అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డి.రొనాల్డ్ రోస్ సిఫారసు చేశారు.
స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, DSTO (వాణిజ్య పన్నుల విభాగం), జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్న దాదాపు 30 మంది అధికారులు… ఎన్నికల విధులు అప్పగించిన తర్వాత శిక్షణ తరగతులకు హాజరుకాలేదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వారిలో ఓయూ ఆర్ట్స్ కళాశాల, ఓయూ పీజీ కళాశాల, కోటి మహిళా కళాశాల, సైఫాబాద్ సైన్స్ కళాశాల, నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.